ప్రయాణికులకు ఆర్టీసీ భారీ ఊరట

భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి.

Update: 2024-09-04 10:05 GMT

దిశ, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారులు కొట్టుకు పోవడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్(Hyderabad), విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ధరలో 10% రాయితీ కల్పిస్తున్నట్టు టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇది అన్ని ఏసీ, రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులో వర్తిస్తుందని, ముందస్తు రిజర్వేషన్స్ ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https//www.tgsrtcbus.in లో చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు తెలియ జేశారు.   


Similar News