టీపీసీసీ కొత్త ప్రోగ్రాం స్టార్ట్.. నేటి నుంచి జిల్లాల వారీగా...

నూతన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొత్తగా పార్టీ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Update: 2024-09-21 01:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: నూతన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొత్తగా పార్టీ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేటి నుంచి జిల్లాల వారీగా గాంధీభవన్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వరంగల్, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు కరీంనగర్, 4 నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లాలపై సమీక్ష జరపనున్నారు. ఈ సమీక్షలో ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీ­సీ కార్యదర్శి విశ్వనాథన్, సంయుక్త కార్యదర్శి పీసీ వి­ష్ణునా­థ్‌తో పాటు పీసీసీ చీఫ్, మంత్రులు, జిల్లా ఇన్‌చార్జి మం­త్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఫ్రంటల్ చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొంటారు. మరోవైపు మంత్రులు గాంధీ భవన్‌కు వచ్చే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇకపై ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక మంత్రి గాంధీభవన్‌లో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.


Similar News