‘CM రేవంత్‌కు తెలియకుండా జరుగుతుందంటే అంటే నేను ఒప్పుకోను’

బీఆర్ఎస్ ముఖ్య నేతలు రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిశారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేశారు.

Update: 2024-05-16 11:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ముఖ్య నేతలు రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిశారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేశారు. అనంతరం నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. పోలీసు సమక్షంలోనే విచక్షణా రహితంగా పట్టపగలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, మరో నయూమ్ ముఠాలు చూస్తున్నట్లు తెలిపారు. హోంమంత్రి ఆయననే, ముఖ్యమంత్రి ఆయననే, రేవంత్‌కు తెలిసే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అచ్చంపేటలోనే పుట్టి పెరిగిన వ్యక్తి అని.. ఇదంతా ఆయనకు తెలియకుండా జరుగుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి ప్రాణ హాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జరగని దాడులు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. 

Read More...

ఇన్‌కమ్‌పై సీఎం ఫోకస్.. మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ 

Tags:    

Similar News