Revanth Reddy: సీఎంను కలిసిన బీజేపీ నేత.. అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానం

బీజేపీ నేత బండారు విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Update: 2024-10-10 07:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేత బండారు విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.ఈ సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని సీఎంను ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి సీఎంను కలిశారు. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ మేరకు అలయ్ బలయ్ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. కాగా దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయాలు ప్రతిభింబించేలా.. సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చి అలయ్ బలయ్ జరుపుకుంటారు.


Similar News