దారుణం.. మతిస్థిమితం లేని వృద్ధురాలిపై అత్యాచారం

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని వృద్ధురాలిపై వ్యక్తి అత్యాచారం చేశాడు.

Update: 2024-08-27 17:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని వృద్ధురాలిపై వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో చట్టాలను తీసుకొస్తున్నా.. కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా, మహిళలపై దారుణాలు తగ్గడం లేదు. అత్యాచారం చేసి చివరికి వారి ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడడంలేదు. పండు ముసలి నుంచి పసికందు వరకు ఎవరినీ వదలడం లేదు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా నిందుతులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Similar News