అసైన్డ్ భూ సమస్యలను పరిష్కరిస్తాం : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అసైన్డ్ భూసమస్యలను

Update: 2024-10-24 14:25 GMT

దిశ, కుల్కచర్ల : రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అసైన్డ్ భూసమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్,ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల మండలం అల్మాస్ ఖాన్ పెట్ గ్రామం,చౌడపూర్ మండలం లోని ముక్త వెంకటాపూర్ , మందిపాల్ గ్రామాల్లో అసైన్డ్ భూముల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్, పరిగి ఎమ్మెల్యే,జిల్లా అదనపు కలెక్టర్ లింగ నాయక్,ఆర్డీవో వాస్తు, ఏడి సర్వే ల్యాండ్ రాంరెడ్డి లు పాల్గొని రైతుల సమస్యలను,అసైన్మెంట్ భూముల వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతుల దగ్గరకే వచ్చి సమష్యలను పరిష్కరిస్తామని,అసైన్డ్ భూములు కలిగిన రైతులు ఎటువంటి తొందరపాటు పడకుండా తహసీల్దార్,ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరగరాదన్నారు.భూములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పత్రాలు మీ చేతిలో ఉంటె మీకు ప్రభుత్వం అందించే రైతు భీమా,రైతు భరోసా అన్ని పథకాలకు అర్హులు అవుతారని,మీ వారసత్వానికి మీ ఆస్థి చెందుతుందన్నారు.సమస్యల పరిష్కారానికి ఎన్ని టీంలను ఏర్పాటు చేయాలో చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు,స్థానిక నాయకులు,రైతులు,తదితరులు పాల్గొన్నారు.


Similar News