వార్డు సభ్యుడు లక్ష్మారెడ్డి మృతి గ్రామానికి తీరని లోటు : ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

మండలంలోని వీరన్నపల్లికి చెందిన ఐదవవార్డు సభ్యుడైన లక్ష్మారెడ్డి లాంటి మృదుస్వభావి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ గురై మృతి చెందడం గ్రామానికి తీరనిలోటని ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

Update: 2023-05-05 17:10 GMT

దిశ, తలకొండపల్లి : మండలంలోని వీరన్నపల్లికి చెందిన ఐదవవార్డు సభ్యుడైన లక్ష్మారెడ్డి లాంటి మృదుస్వభావి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ గురై మృతి చెందడం గ్రామానికి తీరనిలోటని ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మృతి చెందిన విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ వరప్రసాదరెడ్డి, సర్పంచులు నాగమణి లింగం గౌడ్, జయమ్మ వెంకటయ్య, ఖానాపూర్ వెంకటరామిరెడ్డి వీరన్న పల్లి గ్రామానికి చేరుకొని లక్ష్మారెడ్డి పార్తివదేహానికి పూలమాలలు వేసి వారి ఆత్మ శాంతించాలని నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Tags:    

Similar News