అండర్ డ్రైనేజీకి మోక్షం ఎప్పుడో.?..తీర్మానం చేసి రెండేళ్లయిన మొదలు పెట్టని పనులు

గత ప్రభుత్వం అండర్ డ్రైనేజీల నిర్మాణం, యూత్ బిల్డింగ్, కోసం

Update: 2024-07-08 11:26 GMT

దిశ,యాచారం : గత ప్రభుత్వం అండర్ డ్రైనేజీల నిర్మాణం, యూత్ బిల్డింగ్, కోసం నిధులను కేటాయించింది. కాగా గ్రామపంచాయతీ కాంట్రాక్టర్ తీర్మానం సైతం చేయించుకోగా నేటికీ అభివృద్ధి పనులను మొదలు పెట్టకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వివరాలలోకి వెళితే.. యాచారం మండలం నజ్దిక్ సింగారం, గ్రామంలోని 2వ వార్డులో 3 లక్షలు, 6, 7, వార్డులలో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీల నిర్మాణం యూత్ భవన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను కేటాయించింది గ్రామపంచాయతీలో గత పాలకవర్గం గుత్తేదారుకు తీర్మానం సైతం రాసి ఇవ్వగా నిధులు విడుదల కాకపోవడంతో రెండు సంవత్సరాలు అయిన పనులను ప్రారంభించలేదు. అండర్ డ్రైనేజ్ నిర్మాణం లేకపోవడంతో మురికి నీటిలో పెరిగే ఈగలు, దోమలు, దుర్వాసనతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన అండర్ డ్రైనేజీల నిర్మాణ పనులకు నిధులను కేటాయించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

కొత్త ప్రభుత్వమైన గ్రామ సమస్యలు పరిష్కరించాలి : మాజీ వార్డు సభ్యులు,వన్నె వాడ లక్ష్మారెడ్డి

గత ప్రభుత్వం అండర్ డ్రైనేజీల నిర్మాణం యూత్ బిల్డింగ్ కోసం నిధులను కేటాయించింది కానీ పనులను ప్రారంభించలేదు. రెండేళ్లుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైన ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.


Similar News