దిశ కథనానికి స్పందన.. రోడ్డుపై గుంతల పూడ్చివేత

Update: 2024-08-17 14:52 GMT

దిశ, తలకొండపల్లిః మండలంలోని ఇటీవల వర్షాలకు కల్వట్ల వద్ద రోడ్డు మొత్తం గుంతలమయం అయి చాలా ఇబ్బందిగా మారింది. అయితే ఈ రహదారి గురించి దిశలో డబుల్ రోడ్డుకు మోక్షమెప్పుడు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా ఈ కథనానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్న రాజేందర్ రెడ్డి ముందుకొచ్చి శనివారం స్వచ్ఛందంగా మురాన్ని (మట్టిని) పోహించారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుంతలను స్వచ్ఛందంగా పూడ్చినట్లు పేర్కొన్నారు. ఈనెల 12న దిశ ముందుగానే నిధులు ఉన్న అధికారుల నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించింది. 

Tags:    

Similar News