గతంలో మంజూరైన నిధులను విడుదల చేయాలి : మహేశ్వరం ఎమ్మెల్యే

మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవద్దని

Update: 2024-10-24 12:08 GMT

దిశ,తుక్కుగూడ(మహేశ్వరం): మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధిని అడ్డుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,సీఎం రేవంత్ రెడ్డిని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, రావిరాల పెద్ద చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో చెరువుల సుందరి సుందరీకరణ కోసం మాజీ సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశామన్నారు.నేడు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసిన నిధులను అడ్డుకోవడం వల్ల అన్ని పనులు నిరంతరాయంగా మిగిలిపోయాయన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మంజూరైన నిధులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బరిగెల హేమలత రాజు గౌడ్,వైస్ చైర్మన్ భవాని వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు మధుమోహన్,బోధ యాదగిరి రెడ్డి,రవి నాయక్, రెడ్డి గల్ల సుమన్, సప్పిడి లావణ్య రాజు ముదిరాజ్,జపాల భావన సుధాకర్,శివకుమార్, బాకీ విలాస్,మున్సిపాలిటీ కమిషనర్ వెంకట్రామ్,మేనేజర్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.


Similar News