ధ్యానంతోనే మానసిక ప్రశాంతత

ధ్యానంతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-21 10:30 GMT

దిశ, నందిగామ : ధ్యానంతోనే మానసిక ప్రశాంతత సాధ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలో నిర్వహించిన మూడు రోజుల హార్ట్ ఫుల్ నెస్ డిజైనింగ్ యువ సమ్మేళనంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, సామరస్యం ఎంతో అవసరం అన్నారు. అలాగే యువత మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఇలాంటి సంస్థలకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, సుశీల రామ్, ఆర్సీ అగర్వాల్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News