Minister Sitakka : ఖిలా మైసమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క పూజలు

బోనాల పండుగ సందర్భగా అర్కేపురం డివిజన్ లోని ఖిలా మైసమ్మ అమ్మవారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు.

Update: 2024-07-28 12:56 GMT

దిశ, సరూర్ నగర్ : బోనాల పండుగ సందర్భగా అర్కేపురం డివిజన్ లోని ఖిలా మైసమ్మ అమ్మవారిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భగా సీతక్క మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు కీలా మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈసారి ప్రభుత్వ తీరులో నిర్వహణ మరింత బాగుగా ఉండేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లను మేము తీసుకున్నట్టు తెలిపారు. ఈసారి కిలా మైసమ్మ దేవాలయానికి తనని ఆహ్వానించినందుకు

     మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ కిచన్నగారి లక్ష్మారెడ్డికి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఆమెతో పాటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి, ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న గణేష్ నేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News