వైభవంగా జగన్నాథ రథయాత్ర

జగన్నాథ స్వామి రథయాత్ర ను పురస్కరించుకుని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

Update: 2024-07-07 13:50 GMT

 దిశ, రాజేంద్రనగర్ : జగన్నాథ స్వామి రథయాత్ర ను పురస్కరించుకుని మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ హనుమాన్ టెంపుల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి కమిటీ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాటే దాన్ హనుమాన్ టెంపుల్ నుంచి బృందావన్ కాలనీ పూరి జగన్నాథ స్వామి దేవాలయం వరకు కొనసాగిన రథయాత్రలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. పూరి జగన్నాథ స్వామి వారి చల్లని ఆశీస్సులు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గాయదర్, సరోజ్, మున్న, సుదమ, అభిమన్యు, ఎన్ను శ్రీనివాస్ రెడ్డి, పాండు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.


Similar News