దామగుండం అడవిని కాపాడుకుందాం
నెవీ రాడార్ వల్ల మూడు వేల ఎకరాల్లో ఉన్న 12 లక్షల ఔషధ మొక్కలు నాశనమవుతున్నాయని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు.
దిశ,పరిగి : నెవీ రాడార్ వల్ల మూడు వేల ఎకరాల్లో ఉన్న 12 లక్షల ఔషధ మొక్కలు నాశనమవుతున్నాయని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సేవ్ దామగుండం అని ప్రకృతి ప్రేమికులు నిర్వహించిన ధర్నాకు ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా ప్రకృతిని నాశనం చేసే నెవీ రాడార్ మనకొద్దంటూ ముక్త కఠంతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పరిగి మండలం అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జేఏసీ నాయకులు రవికుమార్, సునంద, బుగ్గన యాదవ్, రామన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.