దామగుండం అడవిని కాపాడుకుందాం

నెవీ రాడార్​ వల్ల మూడు వేల ఎకరాల్లో ఉన్న 12 లక్షల ఔషధ మొక్కలు నాశనమవుతున్నాయని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి అన్నారు.

Update: 2024-09-22 14:36 GMT

దిశ,పరిగి : నెవీ రాడార్​ వల్ల మూడు వేల ఎకరాల్లో ఉన్న 12 లక్షల ఔషధ మొక్కలు నాశనమవుతున్నాయని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​ ఇందిరా పార్క్​ వద్ద సేవ్​ దామగుండం అని ప్రకృతి ప్రేమికులు నిర్వహించిన ధర్నాకు ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్,​ బీఆర్​ఎస్​ నాయకులు మద్దతు పలికారు.

    ఈ సందర్భంగా ప్రకృతిని నాశనం చేసే నెవీ రాడార్​ మనకొద్దంటూ ముక్త కఠంతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ పరిగి మండలం అధ్యక్షులు ఆర్.ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జేఏసీ నాయకులు రవికుమార్​, సునంద, బుగ్గన యాదవ్, రామన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News