నిరుపేద పొట్టకొట్టిన రైలు

మేకలు కాసుకుంటూ జీవిస్తున్న ఓ నిరుపేద పొట్టకొట్టింది రైలు. ఆయనకున్న మేకలపై నుంచి రైలు వెళ్లడంతో అవి మృత్యువాత పడ్డాయి.

Update: 2024-09-22 15:44 GMT

దిశ, మర్పల్లి : మేకలు కాసుకుంటూ జీవిస్తున్న ఓ నిరుపేద పొట్టకొట్టింది రైలు. ఆయనకున్న మేకలపై నుంచి రైలు వెళ్లడంతో అవి మృత్యువాత పడ్డాయి. దాంతో ఉన్న జీవనాధారం కోల్పోవడంతో పాటు రూ. 50 వేలు నష్టం వాటిల్లింది. ఈ ఘటన ఆదివారం మర్పల్లి రైల్వే ట్రాక్ వద్ద చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బాదుషా తన వద్ద ఉన్న మూడు మేకలను రోజు మాదిరిగానే మేత మేపడానికి అడవికి తోలుకెళ్లాడు. మేకలు మేత మేసుకుంటూ పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. తన కుటుంబం మేకలపైనే ఆధారపడి ఉందని, అవి చనిపోవడంతో సుమారు రూ. 50 వేల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. 

Tags:    

Similar News