మొల్లమాంబ జయంతిని విజయవంతం చేయండి..

తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో మొల్ల విగ్రహావిష్కరణ ఈ నెల 26న చేపడుతున్నామని కుమ్మర సంఘం మాజీ మండల అధ్యక్షుడు, ఆ సంఘం జిల్లా నాయకుడు కొండాపురం శ్రీశైలం అన్నారు.

Update: 2023-02-23 09:58 GMT

దిశ, యాచారం : తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో మొల్ల విగ్రహావిష్కరణ ఈ నెల 26న చేపడుతున్నామని కుమ్మర సంఘం మాజీ మండల అధ్యక్షుడు, ఆ సంఘం జిల్లా నాయకుడు కొండాపురం శ్రీశైలం అన్నారు.

గురువారం మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుమ్మరుల ఆత్మగౌరవ సభ ఆదివారం సాయిశరణం ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కుమ్మరులు సభకు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

Tags:    

Similar News