రసాభాసగా మారిన బడంగ్​పేట్​లో అభివృద్ది పనుల ప్రారంభోత్సవం...

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్​ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్​ గూడా 05, 06, 24, 25 డివిజన్ లలో రూ.5 కోట్ల 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న పలుఅభివృద్ది పనుల ప్రారంభోత్సవం రసాభాసగా మారింది.

Update: 2023-04-15 13:07 GMT

దిశ, బడంగ్​పేట్​ : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్​ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్​ గూడా 05, 06, 24, 25 డివిజన్ లలో రూ.5 కోట్ల 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న పలుఅభివృద్ది పనుల ప్రారంభోత్సవం రసాభాసగా మారింది. ముందుగా రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్​పేట్​ మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్​లతో కలిసి బడంగ్​పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని 25వ డివిజన్​లో రాజీవ్​ గృహకల్ప వద్ద రూ.15 లక్షల వ్యయంతో నిర్మితమవుతున్న సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేశారు. రాజీవ్​ గృహకల్ప నుంచి బీఆర్​ఎస్​ నాయకులు పెద్దఎత్తున డీజే ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి డివిజన్​ 5, 26లలోని తెలంగాణ కాలనీ నుంచి సాగర్​ కాంప్లెక్స్​ పార్క్​ వరకు రూ.2కోట్ల 40లక్షల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న బీటీ రోడ్డు పనులకు శంఖుస్థానపన చేయడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంట బీఆర్​ఎస్​ కార్పొరేటర్లు, స్థానిక కాలనీల అధ్యక్షులతో పాటు మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి వెంట పలువురు కాంగ్రెస్​ కార్పొరేటర్లు, నాయకులు వెళ్ళారు.

డీజేను వెళ్లగొట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

రాజీవ్​ గృహకల్ప నుంచి తిరుమల నగర్​కు పెద్దశబ్దంతో వస్తున్న డీజేను మంత్రి సబితాఇంద్రారెడ్డి వెళ్ళిపోవాల్సిందిగా సూచించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి శిలాఫలకం వద్దకు చేరుకోగానే... జై సబితమ్మ.. జై బీఆర్​ఎస్​ అంటూ నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బీఆర్​ఎస్​ నాయకులకు పోటీగా కాంగ్రెస్​ నాయకుల తెలంగాణ ఇచ్చింది సోనియా.. జై కాంగ్రెస్​..​ జై చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అంటూ కాంగ్రెస్​ నాయకులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ నాయకుల మధ్య తోపులాట...

అంతేగాకుండా మేయర్​ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా వివాదమయ్యింది. ఈ ఫ్లెక్సీలు తాము ఏర్పాటు చేసినవి కావని, స్థానిక కాలనీల అధ్యక్షులు ఏకమయి వేసుకున్న ఫ్లెక్సీలు అంటు బీఆర్​ఎస్​ నాయులు అంటుండగా, ప్రోటో కాల్​ లేకుండా కావలసుకునే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్​ నాయకులు మండి పడ్డారు. ఇంతలోనే స్థానిక కాలనీ కార్యదర్శి అమరేందర్​ మెడలో బీఆర్​ఎస్​ కండువా ఉండడంతో, నువ్వు బీఆర్​ఎస్​ నాయకుడివా ? కాలనీ పెద్దవా అంటూ కాంగ్రెస్​ కార్పొరేటర్లు మనోహర్​, వంగేటి ప్రభాకర్​రెడ్డిలు కండువా లాగడంతో వివాదం మొదలయ్యింది. బీఆర్​ఎస్​ పార్టీ కండువా ఎలా లాగావంటూ స్థానిక కార్పొరేటర్​ దీపికా శేఖర్​రెడ్డి కాంగ్రెస్​ కార్పొరేటర్​పై దుర్భాషలాడారు. దీనికి కాంగ్రెస్​ కార్పొరేటర్లు సైతం దుర్భాషలాడారు.

నువ్వెంతా ? అంటే నువ్వెంతా అని ఒకరినొకరు తోసివేసుకున్నారు. రంగంలోకి దిగిన మీర్​ పేట్​ ఇన్​స్పెక్టర్​ మహేందర్​ రెడ్డి సమయ స్పూర్తితో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇదంతా గమనించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేస్తూ కాన్వాయ్​ ఎక్కి కూర్చుంది. దానికి ముందు మేయర్​ కాన్వాయ్​ అడ్డుగా ఉండడం .. డ్రైవర్​ లేకపోవడంతో... ఒక్క నిమిషం కాన్వాయ్​లో కూర్చున్న మంత్రి సబితా కారు దిగి మండుటెండలో కిలోమీటర్​ వరకు నడుచుకుంటూ వెళ్లింది. అనంతరం కోమటికుంట చెరువు వద్ద వైకుంఠథామం వద్ద పలు అభివృద్ది పనులకు శంఖుస్థాపన చేసి వెళ్లిపోయింది. ఇది ఉలా ఉండగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హుందాతనంతో డీజేను అడ్డకున్న విషయాన్ని కాంగ్రెస్​ నేతలు విస్మయించారని, స్థానిక కాలనీల పెద్దలు మంత్రి సబిత మీద ఉన్న అభిమానంతో ప్రారంభోత్సవాలకు వచ్చారే తప్పా... బీఆర్​ఎస్​ పార్టీ పరమైన కార్యక్రమాలకు రాలేరని బడంగ్​పేట్​ కార్పొరేషన్​ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి స్పష్టం చేశారు.

ఈ ఏరియాతో సంబంధం లేని కాంగ్రెస్​ కార్పొరేటర్లు అభివృద్దిని అడ్డుకోవడమే గాకుండా ప్రారంభోత్సవానికి వచ్చిన కాలనీ అధ్యక్షులను కించపరచడం ఎంతవరకు సమంజసమని స్థానిక కార్పొరేటర్​ దీపికా శేఖర్​రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్​ కండువా వేసుకుంటే తప్పేంటని, మంత్రిపై అభిమానంతో వచ్చిన, కాలనీ పెద్దల మెడలో కండువా లాగడం సరికాదని హితవు పలికారు. తాము మంత్రి వెంట చాలా కార్యక్రమాలలో బాలాపూర్​లో ప్రారంభోత్సవాలలో పాల్గొన్నామని, తమ ఏరియా కాదని వెనుక నిలబడ్డ విషయాన్ని మరువద్దన్నారు. దమ్ముంటే వంగేటి ప్రభాకర్​ రెడ్డి రాజీనామ చేసి మళ్ళీ గెలిచి చూపెట్టాలని సవాల్​ విసిరారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, స్థానిక కార్పొరేటర్లు ఏనుగు రామిరెడ్డి, ముత్యాల లలితా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News