హైడ్రా కూల్చేసినా ఆగని అక్రమ నిర్మాణాలు
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డుకునేవారు, అడిగేవారు లేకపోవడంతో తమకు నచ్చినట్టు గా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మణికొండ మున్సిపల్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జాదారులు తమ ఇష్టమన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
దిశ, గండిపేట్ : మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అడ్డుకునేవారు, అడిగేవారు లేకపోవడంతో తమకు నచ్చినట్టు గా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మణికొండ మున్సిపల్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జాదారులు తమ ఇష్టమన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న స్థలంతో పాటు నాలాను ఆక్రమించి ఏర్పాటుచేసిన ఓ రేకుల ప్రహరీని ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు. హై టెన్షన్ కరెంట్ తీగల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నిబంధన అతిక్రమించడమే కాకుండా చారిత్రాత్మక ముల్కాపూర్ నాలాను సైతం ఓ నిర్మాణ సంస్థ కబ్జా చేస్తున్న ట్లు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇలా స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకున్నారు. మణికొండ మర్రిచెట్టు సమీపంలో ఓ సంస్థ నాలాలో కలిపేసుకుని హైటెన్షన్ విద్యుత్ తీగల కింద నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రేకుల ప్రహరీని హైడ్రా తొలగించింది. శంకరపల్లి లోని బుల్కాపూర్ చెరువు నుంచి ఖానాపూ ర్, కోకాపేట్, నార్సింగి, పుప్పాలగూ డ, మణికొండ, దర్గా, షేక్ పేట్, టోలిచౌకి, పోచమ్మ బస్తీ, చింతల బస్తీల మీదుగా హుస్సేన్ సాగర్కు వర్షపు నీటిని తీసుకెళ్లే బుల్కాపూర్ నాలా పునరుద్ధరణతో చాలా ప్రాంతాలకు భూగర్భ జలాలు పెంచినట్లు అవుతుందని హైడ్రా ని కోరారు. హుస్సేన్ సాగర్కు వర్షపు నీరు తీసుకొచ్చే ఏకైక నాలా ఈ బుల్కాపూర్ అని స్థానికులు చెబుతున్నారు.
అధికారుల మెతక వైఖరి..
మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్ నాలా విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా బల్కాపూర్ నాలాలో కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే అందులో హైడ్రా కూల్చివేసిన నిర్మాణదారుడు తిరిగి పరదాలు కట్టడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారుల దృ ష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే నిర్లక్ష్యపు సమాధానాలతో దాటవేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.10 కోట్లతో రోడ్డు సైతం వేసిం దని, ఆ విషయాన్ని సైతం అధికారులు మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. రూ.10 కోట్లతో నిర్మించిన రోడ్డు నిర్మాణదారులు మూసి వేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ‘కుర్చీ వేసుకుని ఇక్కడే కూర్చోవాలా.. మా కేం పనులు ఉండవా.. ఒత్తిళ్లు వస్తున్నాయి’ అంటూ సమాధానం ఇస్తున్న ట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెరువును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు..
కూల్చివేసిన రెండు రోజులకే పరదా..!
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణం గా గుర్తించి హైడ్రా కూల్చి వేసింది. దీంతో సదరు సంస్థ నిర్మాణాన్ని ఆపకుండా తిరిగి పరదాలు కట్టి ఐరన్ షీట్లు అడ్డుపెట్టి బిల్డర్ మూసివేసినట్లుగా స్థానికంగా ప్రజలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. నిర్మాణ సంస్థ కూల్చివేతలు నిలిపి వేసినప్పటికీ తిరిగి ఎలా నిర్మాణాలు చేపడతారంటూ ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు ఈ నిర్మాణాలపై చర్యలు తీసుకొని కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.