జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్స్ నిరసన

Update: 2024-08-15 12:21 GMT

దిశ, దోమ : దోమ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ముగ్గురు అతిధి అధ్యాపకులు 16/08/2024 శుక్రవారం నుంచి విధులకు హాజరు కావడం లేదని కళాశాల ప్రిన్సిపాల్ రూపాలక్ష్మి కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి జులై 31 తర్వాత అతిథి అధ్యాపకులకు ఎలాంటి కొనసాగింపు ఉత్తర్వులు వెలువడకపోవడంతో ఎటువంటి ఉద్యోగ భద్రత లేనందున విధులకు హాజరు కావడం లేదని ఎన్ సురేష్ (కెమిస్ట్రీ), హరికృష్ణ( ఎకనామిక్స్), గోవింద చారి(జువాలజీ) తెలిపారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వానికి త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News