నిరుద్యోగుల ఆశయాలను నెరవేస్తున్న ప్రభుత్వం : కల్వకుర్తి ఎమ్మెల్యే

నిరుద్యోగుల ఆశయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Update: 2024-10-10 11:31 GMT

దిశ,ఆమనగల్లు (కడ్తాల్ ): నిరుద్యోగుల ఆశయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ ప్రకటించి రెండు నెలల్లోనే ఫలితాలు ప్రకటించి, అభ్యర్థులకు నియామకాలు అందజేసిన ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. గురువారము ఆయన కడ్తాల్ పట్టణ కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరం లాంటిది అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ, జిల్లా నాయకులు గూడూరు భాస్కర్ రెడ్డి, నాయకులు లక్ష్మయ్య, రామకృష్ణ,బాలరాజు, రామచందర్,జహంగీర్, మల్లేష్ యాదయ్య, బిక్షపతి,నరేందర్,నరేష్, ఇమ్రాన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News