అటవీ,రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : వికారాబాద్ కలెక్టర్

అటవీ, రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని

Update: 2024-10-23 15:17 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : అటవీ, రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. బుధవారం సమావేశం హాల్ నందు ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ సమస్యలను రికాన్సిలేషన్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అటవీ భూములు, రెవెన్యూ భూములకు సంబంధించి అధికారులు జాయింట్ తనికి చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు.

మండలాల వారీగా అసైన్మెంట్ రిజిస్టర్ వెరిఫై చేసి, పూర్తి స్తాయిలో తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, అటవీ శాఖ జిల్లా అధికారి జ్ఞానేశ్వర్, ఏడి సర్వే ల్యాండ్ అధికారి రాంరెడ్డి, ఆర్డిఓ వాసు చంద్ర, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, తాసిల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News