రోజు రోజుకు పెరిగిపోతున్న వీధికుక్కల దాడులు..

గతకొన్ని రోజులుగా ఎక్కడ చూసినా వీధికుక్కలు చెలరేగిపోయి మనుషుల పై దాడులుచేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2023-02-23 09:16 GMT

దిశ, యాచారం : గతకొన్ని రోజులుగా ఎక్కడ చూసినా వీధికుక్కలు చెలరేగిపోయి మనుషుల పై దాడులుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాచారం కేంద్రంలో కూడా వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. అంబర్ పెట్ ఘ‌ట‌న మ‌రవ‌క‌ముందే గురువారం మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాచారం నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే బస్ స్టాప్ ప్రాతంలో నిలుచున్న వారిపై కుక్కలు దాడి చేశాయని తెలిపారు.

బాధితులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు వారు వచ్చి కుక్కలను తరిమి వారిని కాపాడారన్నారు. గాయపడినవారికి తీవ్ర రక్తస్రావ కావడంతో వారిని మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వరుస కుక్కల దాడి ఘటనలతో మండలంలోని ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. ఇంటి నుంచి బయటకెళ్లాలంటేనే వణికిపోతున్నారు. వీధి కుక్కల బారి నుంచి తమని కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు.

Tags:    

Similar News