దావత్ లలో మందు బంద్

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ హైదర్​గూడ వాసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-10-02 11:18 GMT

దిశ, శంషాబాద్ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ డివిజన్ హైదర్​గూడ వాసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుభకార్యాల్లో, దావత్ లలో మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానించారు. అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు సమిష్టిగా దావతులలో మద్య జోలికి వెళ్లరాదని, నిర్వాహకులు మద్యం సరఫరా చేయరాదని శపథం చేశారు. పెళ్లిళ్లు, డిన్నర్లు వంటి శుభకార్యాల్లో, లేదా దావత్ లలో బహిరంగంగా మద్యపానం సేవించడం వల్ల మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, యువతరంపై దుష్ప్రభావం చూపుతోందని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇది సమాజంపై కూడా చెడు ప్రభావం చూపుతోందని వక్తలు అన్నారు. ఆర్థిక స్థోమత ఉన్న ధనవంతులు దావత్ లో మద్యం పంపిణీ చేయడంతో వారిని చూసి పేద, మధ్య తరగతి వాళ్లు కూడా అదే దారిలో వెళ్లి ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని విచారం వ్యక్తం చేశారు.

    బహిరంగ మద్యపాన సేవనం ఏమాత్రం సమంజసం కాదని, నాలుగు గోడలకు పరివితం కావలసిన పనులు బహిరంగంగా జరగడంతో సమాజంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దావతులలో మందు బంద్ చైతన్య ఉద్యమం అత్తాపూర్ హైదర్​గూడ నుంచి ప్రారంభమైందని, మొదట రంగారెడ్డి జిల్లాలో ఈ నిషేధం అమలుకు ఉద్యమిస్తామని వారు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు కొలను సుభాష్ రెడ్డి, మేడం రామేశ్వరరావు, నారగూడెం మల్లారెడ్డి, మొండ్ర కొమురయ్య, వనం నరసింహ, చిట్టి గారి చిన్న నరేందర్, సోమవారం రాజ్ కుమార్, కార్పొరేటర్ సంగీత, మాజీ కౌన్సిలర్ రవీందర్, రణభక్త సమాజం అధ్యక్షులు మొంద్ర నరసింహ, బర్ల మల్లారెడ్డి, కోలన్ సుధాకర్, సాబాద విజయ్, శేఖర్ రెడ్డి, సామాజిక కార్యకర్త జర్నలిస్టు మేడం మధుసూదన్, రావుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News