ఈ మండలాలకు మూడు రోజులు మంచినీళ్లు బంద్..

Update: 2024-08-17 10:01 GMT

దిశ, యాచారంః 3 రోజులపాటు మంచినీళ్ల సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మండల మిషన్ భగీరథ ఏఈ ప్రణయ్ తెలిపారు. మిషన్ భగీరథ, గౌరీదేవిపల్లి 2500 కెవి పంప్ హౌస్ లో మరమ్మత్తుల వలన 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్, మండలాలకు మంచినీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు వివరించారు. 19వ తేదీన యధావిధిగా మంచినీటి సరఫరాను పున ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని సెక్రటరీలు తమ పరిధిలో అందుబాటులో ఉన్న బోరుబావులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Tags:    

Similar News