Disha Effect : దిశ ఎఫెక్ట్​...ఇందిరాగాంధీ సొసైటీలో షెడ్లు కూల్చి వేత

దిశ కథనానికి రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు.

Update: 2024-07-20 14:20 GMT

దిశ, రాజేంద్రనగర్ : దిశ కథనానికి రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించారు. మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని గాంధీ హౌసింగ్ సొసైటీలో వెలిసిన అక్రమ నిర్మాణాలను శనివారం కూల్చివేశారు. నిబంధనల ప్రకారం ఇక్కడ కేవలం రెసిడెన్షియల్ నిర్మాణాలు మాత్రమే కట్టుకోవాలి. అయితే కొందరు రూల్స్ ను అతిక్రమించి కాసులకు కక్కుర్తి పడి భారీగా షెడ్లను నిర్మించి పరిశ్రమలకు రెంటులకు ఇచ్చారు.

    ఈ నేపథ్యంలో సమగ్ర వివరాలతో దిశ పత్రికలో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు స్పందించిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో అధికారులు జేసీబీ సాయంతో మూడు షెడ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే ఊరుకునేది లేదని కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు అక్రమార్కులను హెచ్చరించారు. దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News