case registered : నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి బషీరాబాద్ తహసీల్దార్ వై. వెంకటేష్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఆబ్కారీ కానిస్టేబుల్ సుల్తాన్ తెలిపారు.

Update: 2024-10-26 13:13 GMT

దిశ, బషీరాబాద్: నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసి బషీరాబాద్ తహసీల్దార్ వై. వెంకటేష్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఆబ్కారీ కానిస్టేబుల్ సుల్తాన్ తెలిపారు. ఆబ్కారీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండల పరిధిలోని భోజ్యా నాయక్ తండాకు చెందిన కిషన్ నాయక్ అనే వ్యక్తి నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్నాడని సమాచారం మేరకు ఆబ్కారీ పోలీస్ లు గ్రామానికి చేరుకొని నాటు సారా స్థావరంపై దాడులు నిర్వహించి, రెండు లీటర్ల నాటు సారాను పట్టుకుని కేసు నమోదు చేసి శనివారం తహసీల్దార్ ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. ఎవరైనా నాటు సారా తయారు చేస్తే లేదా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాటు సారా విక్రయించిన వ్యక్తి పై కేసులు నమోదు చేసి రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు.


Similar News