నిషేధంలో ఉన్న డీజే వాడినందుకు కేసు నమోదు..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిషేధంలో ఉన్న డీజే వాడటంతో పాటు అధిక డిసిబుల్స్ సౌండ్ పెట్టి రూల్స్ బ్రేక్ చేసినందుకు పలువురి పై కేసు నమోదు చేసినట్లు మాడ్గుల సీఐ జగదీశ్ తెలిపారు.

Update: 2024-10-15 08:50 GMT

దిశ, ఆమనగల్లు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిషేధంలో ఉన్న డీజే వాడటంతో పాటు అధిక డిసిబుల్స్ సౌండ్ పెట్టి రూల్స్ బ్రేక్ చేసినందుకు పలువురి పై కేసు నమోదు చేసినట్లు మాడ్గుల సీఐ జగదీశ్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించి ఈ నెల 13న డీజేలు వాడిన మాడ్గుల, ఇర్విన్, అర్కపల్లి గ్రామ నిర్వాహకుల పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ముందు ప్రభుత్వ నిబంధనాలకు వ్యతిరేకంగా డీజేలు వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Similar News