Rajendra Prasad: ముగిసిన అంత్యక్రియలు.. కన్నీటి పర్యంతమయిన రాజేంద్ర ప్రసాద్

స్టార్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కుమార్తె గాయత్రి(Gayathri) శనివారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-06 09:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కుమార్తె గాయత్రి(Gayathri) శనివారం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో నటుడు కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కేపీహచ్‌బీలోని ఇందు విల్లాస్‌లో రాజేంద్రప్రసాద్‌ను ఓదార్చి కుమార్తెకు నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే తాజాగా కుటుంబ సభ్యులు KPHBలోని కైలాసవాసం‌లో గాయత్రి అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఇక అంత్యక్రియల సమయంలో కుమార్తె భౌతికాయాన్ని చూసి రాజేంద్రప్రసాద్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


Similar News