Rajasingh: ఇలా ఎంతకాలం..? గృహ నిర్భంధంపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

ఇవాళ మరోసారి పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారని, ఇలా ఎంతకాలం అణిచివేయడానికి ప్రయత్నిస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

Update: 2024-10-20 08:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ మరోసారి పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారని, ఇలా ఎంతకాలం అణిచివేయడానికి ప్రయత్నిస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తనను గృహ నిర్భంధం చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో మాట్లాడుతున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని, మరోసారి ఈరోజు పోలీసులు నన్ను గృహనిర్బంధంలో ఉంచారని తెలియజేశారు. దారుస్సలాం నుండి వచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం నన్ను మౌనంగా ఉంచుతోందా? అని, ఇలా ఎంతకాలం నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తారు అని మండిపడ్డారు.

ఇక నా దారిలో మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అతి త్వరలో ఆలయాన్ని సందర్శించి ముత్యాలమ్మ ఆశీస్సులు పొందుతానని రాజాసింగ్ స్పష్టం చేశారు. కాగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆలయాన్ని సందర్శిస్తానని బీజేపీ నేత రాజాసింగ్ ప్రకటించారు. అప్పటి నుంచి పోలీసులు రాజాసింగ్ ను గృహ నిర్భంధంలో ఉంచుతున్నారు. దీనిపై అందరు ప్రజా ప్రతినిధులకు పర్మిషన్ ఇస్తున్నారు. కానీ నన్ను మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని, ఎన్ని అడ్డంకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముత్యాలమ్మ ఆలయాన్ని తప్పక సందర్శిస్తానని రాజాసింగ్ అన్నారు.


Similar News