కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజయ్య

గురువారం రాష్ట్రవ్యాప్త రుణమాఫీ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Update: 2024-08-22 12:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : గురువారం రాష్ట్రవ్యాప్త రుణమాఫీ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించిన రుణమాఫీ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న తాటికొండ రాజయ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురుకు పార్లమెంటు టికెట్ కోసమే కడియం కాంగ్రెస్ లో చేరరాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే తన తప్పులు కప్పిపుచ్చుకోడానికే ఆ పార్టీలోకి వెళ్లారని, లేదంటే ఎన్నికల ముందే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, అసలు సగం మందికి కూడా రుణమాఫీ రాలేదని అన్నారు. దీనిపై ఎందుకు కడియం శ్రీహరి నోరు మెదపడం లేదని రాజయ్య మండి పడ్డారు. రైతులకు మేలు చేసేది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఇప్పటికైనా ఎలాంటి కండిషన్స్ లేకుండా రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Similar News