కుక్కను మింగిన కొండ చిలువ.. నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియో

మంచిర్యాలలో ఓ కొండ చిలువ ఏకంగా కుక్కను మింగింది.

Update: 2024-08-25 17:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : మంచిర్యాలలో ఓ కొండ చిలువ ఏకంగా కుక్కను మింగింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని గాంధీనగర్ లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. గాంధీనగర్ లోని ఓ చెట్ల పొదల్లో కుక్కను కొండ చిలువ మింగుతుండగా చూసి.. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని కొండచిలువను బంధించి.. సురక్షితంగా అడవిలో విడిచి పెట్టారు. కాగా ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు దానిని తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. 


Similar News