GITAM : సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు ‘గీతం’ యూనివర్సిటీ భారీ విరాళం

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ రూ. కోటి విరాళం ఇచ్చింది.

Update: 2024-09-22 06:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి గీతం యూనివర్సిటీ రూ. కోటి విరాళం ఇచ్చింది. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గీతం ప్రెసిడెంట్, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ చెక్‌ను అందజేశారు. కాగా, తెలంగాణ‌లో ఇటీవల భారీ వ‌ర్షాల కార‌ణంగా పోటెత్తిన వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన ముంపు ప్రాంతాల బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు.

రేవంత్ ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు సినీ, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. తాజాగా గీతం యూనివర్సిటీ తరపు నుంచి ఎంపీ శ్రీభరత్ సీఎం సహాయనిధికి విరాళం అందించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ వరద భాదితుల కోసం కూడా ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఎంపీ శ్రీభరత్ రూ.కోటి చెక్‌ను అందజేసిన విషయం తెలిసిందే.


Similar News