హైదరాబాద్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి
హైదరాబాద్ నేరేడ్మెట్లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నేరేడ్మెట్లో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గ్యాంగ్ రేప్నకు పాల్పడ్డ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలు, కృష్ణ, కిరణ్, అజయ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలికను ట్రాప్ చేసిన యువకులు గంజాయి తాగించి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు తొలుత కాచిగూడ పీఎస్ లో కేసు నమోదు చేసుకుని దాన్ని నేరేడుమెట్ పోలీసు స్టేషన్ కు బదిలీ చేశారు.