ప్రొఫెసర్ సాయిబాబా ఇకలేరు

Update: 2024-10-12 16:55 GMT

దిశ. వెబ్‌డెస్క్: ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం కన్నమూశారు. కాగా.. వర్సిటీ పరిథిలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేసే సమయంలో ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు రావడంతో 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్లుగా నాగ్‌పుర్ జైల్లో శిక్ష అనుభవించారు. ఈ ఏడాది మార్చిలోనే బాంబే హైకోర్టు ఆధ్వర్యంలోని నాగ్‌పూర్ బెంచ్ ధర్మాసనం ఆయనను విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన ఆయన గుండె సంబంధిత సమస్యతో నిమ్స్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాగా.. ఈ రోజు (శనివారం) తుదిశ్వాస విడిచారు.


Similar News