Abdul Kalam : కలాం అడుగుజాడల్లో ప్రధాని మోడీ! తెలంగాణ బీజేపీ ఆసక్తికర పోస్ట్ ఇదే

మాజీ రాష్ట్రపతి భారతదేశ క్షిపణి పితామహుడు, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు.

Update: 2024-10-15 14:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ రాష్ట్రపతి భారతదేశ క్షిపణి పితామహుడు, భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ప్రముఖులు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం తెలంగాణ బీజేపీ అధికార ఖాతా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండని కలాం వ్యాఖ్యలను గుర్తు చేసింది. కలాం అడుగుజాడల్లో ప్రధాని మోడీ నడుస్తున్నారని, భారతీయల కలలను నిజం చేస్తూ విశ్వ వేదికపై సగర్వంగా భారత్‌ను మోడీ నిలబెడుతున్నారని తెలిపింది.

రామమందిర నిర్మాణం స్వప్నించాడు.. సాకారం చేశారని పేర్కొంది. ఆర్థికంలో 3వ స్థానంలో భారత్‌ను నిలబెట్టాలనుకున్నాడు.. సాధిస్తున్నారని వెల్లడించింది. కాశ్మీరంలో మువ్వన్నెల జెండా రెపరెపలు కాంక్షించారు.. నెరవేర్చారని తెలిపింది. వికసిత్ భారతానికై లక్ష్యపెట్టి.. లక్ష్యం దిశగా ప్రధాని మోడీ అడుగులేస్తున్నారని తెలంగాణ బీజేపీ పోస్ట్ చేసింది.


Similar News