మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు.
దిశ, వెబ్డెస్క్: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. సాహిల్ కస్టడీ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ చేయనున్నారు. ప్రజాభవన్ వద్ద బ్యారికేడ్ ను ఢీకొన్న కేసులో రాహిల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో పాటు జూబ్లీహిల్స్ లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా సైతం రాహిల్ ను పోలీసులు చేర్చారు. ఈ రెండు కేసుల్లో విచారించాలని కోర్టుకు పోలీసులు తెలిపారు. మరోవైపు రాహిల్ కు బెయిల్ ఇవ్వాలంటూ అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేశారు.