కేటీఆర్ ను కలిసిన ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు

ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.

Update: 2024-10-16 11:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన ఫీజురీయంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసేలా చొరవ తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. వారి సమస్యలు విన్న కేటీఆర్ స్పందిస్తూ రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందన్నారు. గురుకుల భవనాలకు అద్దె చెల్లించడం లేదని, కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా మూసివేయటంతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు చెల్లించకుండా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసే కాంగ్రెస్ సర్కార్ దగ్గర అద్దె, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు ఇవ్వటానికి పైసలు లేవా? అని నిలదీశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తామంటే బీఆర్ఎస్ సహించదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. 


Similar News