Kavitha: ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది.. ఎయిర్ పోర్టులో కవిత వ్యాఖ్యలు

హైదరాబాద్ బయలుదేరే ముందు కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-28 08:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బెయిల్ లభించడంతో తిహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మరికాసేపట్లో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాబోతున్నారు. హైదరాబాద్ కు బయలుదేరేముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచిందని.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని.. న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదులు అంటూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కాగా ఢిల్లీ నుంచి వస్తున్న కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, కుమారుడు ఉన్నారు. 

Tags:    

Similar News