వాగులో పడి యువతి మృతి

లింగంపేట్ మండలం కొర్పొల్ గ్రామానికి చెందిన కళ్ళు సుప్రజా (22) అనే యువతి పెద్ద వాగులో పడి చనిపోయినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.

Update: 2024-01-08 09:23 GMT

దిశ, లింగంపేట్: లింగంపేట్ మండలం కొర్పొల్ గ్రామానికి చెందిన కళ్ళు సుప్రజా (22) అనే యువతి పెద్ద వాగులో పడి చనిపోయినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. సుప్రజా తల్లిదండ్రులు ఆదివారం విందుకు వెళ్లిన తర్వాత ఇంటి వద్ద ఉన్న సుప్రజ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లినట్లు తెలిపారు. సుప్రజా కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతుందని తల్లిదండ్రులు లేని సమయంలో సుప్రజా మూర్చ రావడంతో పొలం దగ్గర ఉన్న వాగులో పడి మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో సుప్రజా కనిపించకపోవడంతో చుట్టుపక్కల బంధువుల వద్ద తల్లిదండ్రులు గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వ్యవసాయ పొలం సమీపంలోని వాగులు పరిశీలించారు. వాగు వద్ద మృతదేహం లభ్యమైనట్లు ఆయన తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. 


Similar News