మా ఊరికి ఎందుకు వచ్చావు

మా ఊరికి ఎందుకు వచ్చావు... పోడు భూముల పట్టాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు క్యూ కట్టినా బంగ్లా మీద నుంచి కిందికి దిగలేదు... ఎన్నికలు వచ్చినందున ప్రచారం కొరకు ఓట్లు అడగడానికి మా ఊరికి ఎందుకు వచ్చావు అని లక్ష్మాపూర్ గ్రామ వాసులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-11-22 12:33 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మా ఊరికి ఎందుకు వచ్చావు... పోడు భూముల పట్టాల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కు క్యూ కట్టినా బంగ్లా మీద నుంచి కిందికి దిగలేదు... ఎన్నికలు వచ్చినందున ప్రచారం కొరకు ఓట్లు అడగడానికి మా ఊరికి ఎందుకు వచ్చావు అని లక్ష్మాపూర్ గ్రామ వాసులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ లక్ష్మాపూర్ గ్రామానికి ప్రచారం నిమిత్తం రాగా కారులో నుండి కిందికి దిగగానే గ్రామస్తులు ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా ఉండి మా గ్రామానికి చేసిందేమీ లేదని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, గృహలక్ష్మి పథకం కింద మంజూరైన ఇల్లు, పోడు భూములకు పట్టాలు అందించమని పలుమార్లు వేడుకున్నా పట్టించుకున్న పాపాన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మాపూర్ గ్రామం నుండి ఎమ్మెల్యే వెళ్లే వరకు ప్రజలు రోడ్డుపై అడ్డుకున్నారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో సురేందర్ అక్కడి నుండి వెళ్లిపోయారు.  


Similar News