పాత కక్షలతో ఒకే కుటుంబం పై ముగ్గురు దాడి..

సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పాత కక్షలతో ఒక కుటుంబం పై కత్తులతో జరిగిన దాడులతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

Update: 2024-10-15 07:11 GMT

దిశ, కామారెడ్డి : సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పాత కక్షలతో ఒక కుటుంబం పై కత్తులతో జరిగిన దాడులతో గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. గ్రామానికి చెందిన గుండెల్లి చిన్న సాయిలు కుమారులు మోహన్, అనిల్ కు అదే గ్రామానికి చెందిన మరొక వర్గానికి చెందిన వ్యక్తితో కొంత కాలంగా గొడవ జరగడంతో గ్రామస్తులు సర్ది చెప్పారు.

అది మనసులో పెట్టుకున్న మరొక వర్గానికి చెందిన అన్నదమ్ములు సంతోష్, ప్రదీప్ మరొక స్నేహితుడు కలిసి సాయిలు కుటుంబం పై కత్తులతో దాడికి పాల్పడగా మోహన్, సాయిలు, అనిల్ లకు గాయాలయ్యాయి. ఇందులో సాయిలు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News