సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. ఎమ్మెల్యే

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-09-25 12:11 GMT

దిశ, భిక్కనూరు : ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం నాడు ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 75 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద నగదుతో పాటు, తులం బంగారం పథకం ఎప్పుడు అమలు చేస్తే అప్పుడు మీకు ఇదే విధంగా అందజేస్తానని వివరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్, ప్రధాన కార్యదర్శి అత్తెలి తిరుమలేష్, జిల్లా కోశాధికారి రెడ్డి గారి రమేష్ రెడ్డి, బండి రాములు, మహిళా మోర్చా అధ్యక్షురాలు మాలె లక్ష్మి ఓబీసీ అధ్యక్షులు చిన్నోళ్ల శంకర్, బీజెవైఎం మండల శాఖ అధ్యక్షులు ఆనంద్ శ్రీనివాస్ రెడ్డి, లింగంపేట యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News