వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

బాన్సువాడ నియోజకవర్గంలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్​చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-04-09 13:43 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్​చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చందూర్, మోస్రా మండలాల్లో చందూర్, తిమ్మాపూర్, మేడ్పల్లి, లక్ష్మీ సాగర్ గ్రామాలలో వడగండ్ల వానకి నష్టపోయిన రైతుల పంటలను

    ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ఎకరానికి 10 వేల రూపాయలని నష్టపోయిన రైతులకు అందే విధంగా చూస్తానని అన్నారు. అదేవిధంగా రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందన్నారు. ఆయనతో పాటు ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. 


Similar News