మద్యాన్ని నిషేధిస్తూ గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం

Update: 2024-10-06 07:50 GMT

దిశా ఎల్లారెడ్డి: మద్యాన్ని నిషేధించి తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపాలని తపన పడుతున్న ఆ గ్రామస్థులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా తమ గ్రామంలో మద్యం విక్రయించినట్లయితే రూ.50 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటూ అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. మధ్య నిషేధం చేయడం ఆ గ్రామస్తులు అందరికీ హర్షనీయమని గ్రామస్థులందరూ ఏకతాటిపై తీర్మానం చేసుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామం (అంకుల్ పేట) గ్రామంలో మద్యం అమ్మ రాదని, మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ గ్రామస్థులందరూ మూకుమ్మడిగా తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని గ్రామస్థులందరి ముందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్లొల్ల కిష్టయ్య భాగయ్య, కుమ్మరి సాయన్న, లచ్చారాం, కుమ్మరి చిన్న సాయన్న, లచ్చగౌడ్, యాదగిరి, గాండ్ల రాజు, కుమ్మరి శ్రీను, కుమ్మరి, పండరి, గ్రామ అధ్యక్షులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


Similar News