రంజాన్, హజ్ యాత్రికులకు సహకరిస్తాం

రంజాన్, హజ్ యాత్రికులకు సహకరిస్తాం అని రాష్ర్ట మంత్రి దనసరి అనుసూయ అలియస్ సీతక్క అన్నారు.

Update: 2024-03-24 14:21 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రంజాన్, హజ్ యాత్రికులకు సహకరిస్తాం అని రాష్ర్ట మంత్రి దనసరి అనుసూయ అలియస్ సీతక్క అన్నారు. నిజామాబాద్ నగరంలోని 13వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ హరూన్ ఖాన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఇప్తార్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా కు చెందిన రాష్ర్ట ప్రభుత్వ సలహదారు

    షబ్బీర్ అలీ వినతి మేరకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపావాస దీక్షల ప్రాముఖ్యాన్ని వివరించారు. ప్రభుత్వం రంజాన్ వేడుకలను, హజ్ యాత్రికులకు సహాయ సహకారాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట ఉర్టూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నాయకులు నరాల రత్నాకర్, స్థానిక మరో కార్పొరేటర్ ఖుద్ధుస్, డివిజన్ ఇంచార్జీ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News