ఆ గ్రామంలో ఊర కుక్కల స్వైర విహారం.. ఒకే రోజులో పదిమంది పై దాడి..

సోమవారం ఉదయం నందిపేట మండల కేంద్రంలో ఊర కుక్కలు స్వైర విహారం చేస్తూ పదిమందిని కరిచాయి.

Update: 2024-09-09 10:15 GMT

దిశ, నందిపేట్ : సోమవారం ఉదయం నందిపేట మండల కేంద్రంలో ఊర కుక్కలు స్వైర విహారం చేస్తూ పదిమందిని కరిచాయి. కాగా బాధితులందరికీ తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటనే టీకాలు వేయించడంతో ఎక్కువ ప్రమాదం ఏం లేదని అధికారులు తెలియజేశారు. ఈ పిచ్చికుక్కల పై అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. కుక్కల దాడిలో రామ్ చరణ్, లస్సుం బాయ్, సతీష్ కుమార్ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి.


Similar News