రోడ్లు, డ్రైనేజీ ల సమస్యలపై అర్బన్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి…

రానున్న వర్షాకాలం నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధ్వానంగా తయారైన రోడ్లు, డ్రైనేజీల సమస్యలపై దిశ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.

Update: 2024-06-28 14:01 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: రానున్న వర్షాకాలం నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధ్వానంగా తయారైన రోడ్లు, డ్రైనేజీల సమస్యలపై దిశ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా నగరంలోని ఖాళీల్ వాడిలో హాస్పిటల్స్ తో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో అత్యవసర సమయంలో అంబులెన్సు వంటి వాహనాలకు, నగర ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను వెంటనే మున్సిపల్ కమిషనర్ కి మాట్లాడి వెంటనే రోడ్డు మరమత్తులు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. లేని యెడల తన స్వంత నిధులతో రోడ్డు మరమత్తులు చేపిస్తానని తెలపడం కూడా జరిగిందన్నారు. ప్రజల సమస్యలు తీర్చడమే ప్రజాప్రతినిధులు, అధికారుల కర్తవ్యమని ఆయన అన్నారు. వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు నగరంలో రోడ్డు మరమ్మత్తు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నగర ప్రజలు ఎమ్మెల్యే చొరవకు ధన్యవాదాలు తెలిపారు.


Similar News