గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామ శివారులోని గల మంజీరా వాగులో ఒక గుర్తు తెలియని యువకుడి శవం నీటిలో కొట్టుకొని వచ్చింది.

Update: 2024-10-02 16:04 GMT

దిశ, మద్నూర్: బిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామ శివారులోని గల మంజీరా వాగులో ఒక గుర్తు తెలియని యువకుడి శవం నీటిలో కొట్టుకొని వచ్చింది. మృతుని వయసు 30 సంవత్సరాలు వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. మృతుని కుడి చేతి పైన ఇంగ్లీషులో" సోను" అని రాసి ఉందన్నారు. నల్లని పాయింట్ ధరించి ఉన్నాడు. మృతుని శరీరం పైన ఎలాంటి గాయాలు పైకి కనబడుటలేదు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే..బిచ్కుంద ఎస్సై కు, సిఐ కు సమాచారం అంబిచ్కుంద మండలంలోని వాజిద్ నగర్ గ్రామ శివారులోని గల మంజీరా వాగులో ఒక గుర్తు తెలియని యువకుడి శవం నీటిలో కొట్టుకొని వచ్చింది.దించాలని ఎస్సై మోహన్ రెడ్డి కోరారు.


Similar News