ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకులు మృతి

ఎడపల్లి మండలం అశోకసాగర్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి చెందారు.

Update: 2024-01-12 14:38 GMT

దిశ, బోధన్ : ఎడపల్లి మండలం అశోకసాగర్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని నెహ్రూ నగర్ కు చెందిన కరీం, సమీర్ (17), అనాస్ (18) లు బైక్ పై నెహ్రూ నగర్ నుండి బోధన్ వెళుతుండగా నిజామాబాద్ వైపు ప్రయాణిస్తున్న కారును ఢీకొనడంతో సమీర్, అనాస్ లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కరీం కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు నిజామాబాద్ హాస్పిటల్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


Similar News