రైతు,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ట్రాక్టర్, బైక్ ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ నగరంలో అఖిల భారత రైతు కూలి సంఘం, ఇఫ్టు,పీడీఎస్యూ ఆధ్వర్యంలో ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించారు.
దిశ, నిజామాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ నగరంలో అఖిల భారత రైతు కూలి సంఘం, ఇఫ్టు,పీడీఎస్యూ ఆధ్వర్యంలో ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ రైతుల రుణాలను మాఫీ చేయాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్నిఅమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇఫ్టు జిల్లా అధ్యక్షుడు బి.భూమన్న మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని , కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ను ఆపాలని ,నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, సూర్య శివాజీ, ఖాజా మోహినుద్దీన్, శివకుమార్, జన్నారపు రాజేశ్వర్, జేపీ గంగాధర్, భారతి, దేవస్వామి, గంగన్న, బన్సీ , ప్రిన్స్, వంశీ, ఎల్లప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు.